24, డిసెంబర్ 2015, గురువారం

Book Fair

పుస్తకాల  పండగ డిసెంబర్  2015
NTR GROUNDS లో  Book Fair జరుగుతోంది.
ఈ సందర్భంగా ప్రమదాక్షరి  స్టాల్  లో నేను రాసిన ఫ్రీడం ఫైటర్ కోపల్లె హనుమంత రావు గారి  చరిత్ర పుస్తకం కూదా వుంది.  ఆ రోజుల్లో దేశ భక్తి వెల్లువలా దేశమంతా పారుతున్న వేళ మన ఆంధ్రా దేశం లోనూ అందునా మచిలీపట్టణం లో  ఎంతో మంది వీరులు ఉద్యమాల్లో పాల్గొన్నారు .  అందులో హనుమంత రావు గారు గారు, పట్టాభి గారు, ముట్నూరి గారు తెలుగు నాట తోలి విద్యాలయాన్ని స్తాపించి ఎందరికో విద్యాదానం చేశారు.  నేటికి అది వట వృక్షమై మచిలీపట్టణం లో నిలిచి వుంది.
ఈనాటి Book Fair లో ఈ పుస్తకం  ప్రముఖుల చేతుల్ల్లోను, ప్రముఖు రచయిత్రుల పుస్తకాల వరసన, వుంది. సాహిత్యాల కార్యక్రామాల్లోను పాల్గొన్న నేను,  నా  తోటి రచయిత్రుల తో ఫోటోలు ...




గులాబీ రంగు దుస్తుల్లో ప్రముఖ రచయిత్రులు - ప్రమాదక్షరి సభ్యులు  


ట్రావేలోగ్స్  - చర్చా కార్యక్రమం లో నా అనుభవాలు వింటున్న ప్రముఖ రచయిత్రులు 
చివరి రోజు 27 12 2015  బుక్ ఫెయిర్ లో తోటి రచయిత్రులతో ....
వి. బాలా మూర్తి గారు, వాసా ప్రభావతి గారు, గంటి భానుమతి గారు, మణి


రచయిత్రులు నిలుచున్న వారు : డి కామేశ్వరి , ఆలూరి  గౌరీ లక్ష్మి , అత్తలూరి విజయలక్ష్మి,
గంటి సుజల, జ్యోతి వలబోజు, మణి కోపల్లె . మణి  వడ్లమాని
కూర్చున్నవారు: ముక్తేవి భారతి , పి. యస్. లక్ష్మి ,  తమిరశ జానకి  ,  




చివరి రోజున  బుక్ ఫెయిర్ లో పుస్తకాభిమనులందరు విచ్చేశారు.  ప్రాంగణం అంతా విపరీత మైన  రద్దీ ...  ఈ  సారి ఎక్కువగా పిల్లలు, విద్యార్ధులు, కాలేజీ విద్యార్ధులు, ఎక్కువగా  కనిపించారు.   అందరూ వారి వారి బడ్జెట్ ని పట్టి  పుస్తకాలు కొనుగోలు చేసారు.   పిల్లలకి కొంతమంది ఆటల పోటీలు, వక్తృత్వ పోటీలు , వంటివి నిర్వహిస్తే,  కొంతమంది ఉచిత పిల్లల అనిమేషన్ cd లు అందించారు.  

         ఈసారి ఎక్కువ మంది విజిటర్స్ వచ్చారు.  అలాగే పుస్తకాల సేల్స్  కూడా చాలా బాగా పెరిగాయి.  ఒక్క ప్రమదాక్షరి స్టాల్ లోనే  లక్ష పైగా అమ్మకాలు జరిగాయి .  పోటీ పరీక్షల పుస్తకాలు యువత కొంటే, ఆధ్యాత్మిక పుస్తకాలు  వయసు మళ్ళిన వారు కొన్నారు.  పది రోజులు జరిగిన పుస్తకాల పండుగ లో వచ్చిన వారు, పుస్తకాల అమ్మకాలు చూస్తుంటే ... పుస్తకాలకి మళ్ళీ పునర్ వైభవం వచ్చిందని పించింది.  చదివే వారు  ఎక్కువ అయ్యారు..  

1 కామెంట్‌: