31, డిసెంబర్ 2012, సోమవారం





నూతన సంవత్సరానికి స్వాగతం 

స్వాగతం సుస్వాగతం 
నూతన సంవత్సరానికి 
గతం కలగలిసిన  అనుభూతులతో  
మారింది మరో పేజి కాలెండర్లో 

మధురమైన భావాలు 
మరపురాని అనుభవాలు 
మదిలో చిగిర్చే మరెన్నో కొత్త ఆశలు 
తెచ్చింది నూతన సంవత్సరం  

తెలుగు వారికి పట్టం కట్టిన గత సంవత్సర ముగింపు 
తెలుగు కీర్తి పతకం విను వీధిన మరింత 
పైకెగరాలని 
తెలుగు సాహిత్యం నలుదిశల వెలుగులు ;విరజిమ్మాలని 
తెలుగు పద్యాల సౌరభాలు తెలుగు వారి మది నింపాలని
తెలుగుకు ఉజ్వల భవిష్యత్తును మనసార కాంక్షిస్తూ 
                                                               నూతన సంవత్సరానికి స్వాగతం 







--
mani


24, డిసెంబర్ 2012, సోమవారం

డా|| భానుమతి రామకృష్ణ



డా|| భానుమతి రామకృష్ణ 
Dr.Bhanumathi Ramakrishna
డిసెం బరు 24. ఈ రోజు డా|| భానుమతి రామకృష్ణ  వర్ధంతి.
సినీ వినీలాకాశంలో ధ్రువ తార. 
నేటికి ఆమె ఏంతో  మందికి  అభిమాన  తార. 
ఆమె  ఒక హీరోయిన్ గానే కాదు. బహుముఖ ప్రజ్ఞాశాలి . 
ఆతమ విశ్వాసానికి మారుపేరు. 
నటీ మణి దర్శకురాలు, నిర్మాత, రచయిత్రి, అన్నిటికి మించి గాయకురాలు. భానుమతి పాటలు  నేటికి ఎంతో మంది వింటుంటారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ కి అధినేత్రి. 
సంగీత దర్శకురాలు. 
చెన్నై లోని తన ఇంటిలో 2005లో డిసెంబర్  24న  మనకి భౌతికంగా దూరం అయ్యారు. కాని నేటికి ప్రేక్షకుల మదిలో చిరంజీవియే!

 జీవిత విశేషాలు 
  భానుమతి సెప్టెంబర్ నెలలో ఒంగోలులో జన్మించారు. తండ్రి వెంకటరాజు సుబ్బయ్య. వారు కూడా సంగీత కళా విశా రుదులు. సంగీత ప్రియులు. భానుమతి తండ్రి వద్దనే సంగీతం నేర్చుకున్నారు.  సంప్రదాయ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమె తన 13వ ఏటనే 1939లో విడుదలైన వరవిక్రయం సినిమా ద్వారా  సినీ రంగ  ప్రవేశం చేసారు. 1943లో కృష్ణ ప్రేమ సినిమాలో నటించింది. ఆ సినిమా డైరెక్టర్ అయిన రామకృష్ణా రావు ని  ప్రేమించి  వివాహం చేసుకున్నారు. వీరు తమిళ్, తెలుగు చిత్ర నిర్మాత, దర్శకులు, ఎడిటర్.  ఈ దంపతులకి  ఒక కొడుకు పేరు భరణి . అతని పేరుమీదే భరణి స్టూడియోస్ నిర్మించారు. అనేక సినిమాలు నిర్మించారు.
దాదాపు 50 సంవత్సరాలకు పైగా సినీరంగంలో వున్నా వీరు వంద చిత్రాలలో మాత్రమే నటించారు

  బిరుదులు 

  • అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ పురస్కారం 1956లో అందుకున్నారు.
  • అంతస్తులు, పల్నాటి యుద్ధం, అన్నై  (తమిళ్ సినిమా)లకు మూడు సార్లు జాతీయ అవార్డులు 
  • నడిప్పుకు ఇళక్కనం అనే బిరుదు 
  • అష్టావధాని అని తమిళ్ ప్రజలు కీర్తిస్తుంటారు.
  • 1966లో పద్మశ్రీ అవార్డు.  అమె  రచించిన అత్తగారి కధలు - హాస్య సంపుటికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీని భారత ప్రభుత్వం చే అందుకున్నారు. ఇదే సంపుటికి రాష్ట్ర సాహిత్య అకాడెమి అవార్డు కుడా వచ్చింది.
  • 1975లో   కళా ప్రపూర్ణ బిరుదు 
  • 1984లో కలైమామణి బిరుదు 
  • 1984లో గౌరవ డాక్టరేటు (తిరుపతి విశ్వవిద్యాలయమచే  )
  • 1986లో రఘుపతి వెంకయ్య అవార్డు 
  • 1986లో ఉత్తమ దర్శకురాలు అవార్డు
  • 2001లో పద్మ భూషణ్ అవార్డు 
  • 'నాలో నేను'  ఆత్మ కధకి  స్వర్ణ కమలం అందుకున్నారు.
  • ఇంకా ఎన్నో అవార్డులు సత్కారాలు అందుకున్నారు.

రచయిత్రిగా 
అత్తగారి కధలు, నాలోనేనురచించారు.
సినిమాలు 
ఆమె నటించిన ఎన్నో పాత్రలు నేటికి సజీవమై నిలిచాయి.
తెలుగువారి క్లాసికల్ సినిమాగా వర్ణించే మల్లీశ్వరి నేటికి కళాఖండమే. అమాయకురాలి మల్లి పాత్ర మరువలేము.
ఇక ఆ చిత్ర సంగీతం ఎంతో మధురమైంది. ఆమె నటనకి మరో మైలురాయి బాటసారి. ఆ చిత్రం కూడా ఏంతో ప్రసిధి చెందింది. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో చిత్రాలు ఆమె నటనా ప్రతిభకు అద్దం  పడతాయి. 
తెనాలి రామకృష్ణ చిత్రంలో ఆమె చేసిన నాట్యం... మరువగలమా. అమే ఎన్నో చిత్రాలలో తన నాట్య కౌశ సలాన్ని ప్రదర్శించారు. చిత్తూరు నాగయ్య తో నటించిన స్వర్గసీమ లోని పాత్రకూడా మరువలేము. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో చిత్ర రాజాలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. 
నాటి తొలి సినిమా వరవిక్రయం నుంచి కృష్ణప్రేమ మంగమ్మగారి మనవడు, గృహలక్ష్మి, అంతా మనమంచికే 1998లో వచ్చిన పెళ్లి కానుక వరకు ఎన్నో సినిమాలు ,, ప్రతి పాత్రలో ఆమె జీవించారు. 
నాయకురాలి పాత్ర అయినా, ప్రతినాయకురాలి పాత్ర అయినా ఆమెకి ఆమె సాటి.
మల్లీశ్వరి లో మల్లి ... పల్నాటి యుదంలో నాగమ్మ రెండు వైవిధ్య భరితమైనవే.   విప్ర నారాయణ లో పరమ భక్తుడిని ఎలా సంసారిని చేసింది...  అంతస్తులలోని అక్కినేనికి తోబుట్టువుగా  చలాకి పాత్ర ...  సారంగధర... తోడూ నీడలో రామారావు గారి కి తోడుగా సవతి పాపకి ప్రేమని పంచే తల్లిగా..... ఇలా ఎన్ని చెప్పినా ఇంకా మిగిలి పోతూనే వుంటాయి. 
గాయినిగా 
తను నటించిన ప్రతి సినిమా లోను తన పాత్రలకి తానె పాడుకున్నారు. భానుమతి పాటలు వినని వారు, అబిమానించని వారు వుండరు.
దర్శకురాలిగా 
చండీరాణి, గృహలక్ష్మి, అంతా మనమంచికే, విచిత్ర వివాహం, అమ్మాయి పెళ్లి,  మనవడి కోసం, రచయిత్రి, ఒకనాటి రాత్రి, పెరియమ్మ (తమిళ్), భక్త ధ్రువ మార్కండేయ, అసాధ్యురాలు ఇలా ఎన్నో చిత్రాలున్నాయి.
నిర్మాతగా 
రత్నమాల, లైలా మజ్ను, ప్రేమ, చండిరాణి  చక్రపాణి విప్రనారాయణ, చింతామణి, వరుడుకావాలి, బాటసారి.
చింతమణి , చక్రపాణి సినిమాలకి సంగీత దర్సకత్వం వహించారు. 

13, డిసెంబర్ 2012, గురువారం

Hanumanji Mahamastakaabhishekam at Sidhabari Himalayas (HP)


Veer Hanuman






సిద్దబారి 
ఇది ఒక చిన్న పల్లెటూరు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రా జిల్లాలో ధర్మశాల మండలంలో వుంది.  ధర్మశాల నుంచి పది కిలోమీటర్ల దూరం లో చుట్టూ ధవళదార హిమవత్  పర్వతాల ఎత్తైన శిఖరాల మధ్య ఈ చిన్న గ్రామం వుంది. ఈ గ్రామానికి దగ్గరలోనే స్వామి చిన్మయానందచే స్థాపించబడిన తపోవన్  ఆశ్రమం  బిందు సారస్   అందమైన నదీపాయల నడుమ  వుంది. అందమైన ఈ ఆవరణలో  30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం హిమాలయాలను పరిరక్షిస్తున్నట్లుగా వుంటుంది .  
Swami Chinmayanandaji's kuteer at sidhabari
స్వామి  విపరీతమైన గాలులు, తుఫాను గాలులుల నుంచి రక్షించటానికి ఈ గంభీరమైన, వీరాసనంలో కూర్చున్న ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈ విగ్రహం  స్తాపించక   ముందు అక్కడ విపరీతమైన  గాలులు వీస్తుండేవి.  ప్రతి పనికి ఆటంకంగా వుండేది. ఏంతో  పంట నష్టం జరిగేది. చుట్టూ మంచుతో కప్పబడి వుండేది. జనజీవితం అస్తవ్యస్తంగా వుండేది. ఏమి నిర్మించదలుచుకున్న ఆ భవంతులు కూలిపోతుండేవి. 
సంకల్పం 
          అటువంటి సమయంలో స్వామి చిన్మయానంద పవన సుతుడైన  హనుమంతుని విగ్రహం స్తాపించ దలచారు.  1979లో మొదలు పెట్టిన ఈ విగ్రహం 1982లో పూర్తి చేసుకుని 10 అక్టోబర్ నాడు ప్రతిష్టిం చబడింది. ఈఆంజనీయుని ఆరాధించటం మొదలు పెట్టిన తరువాత అక్కడి వాతావరణంలో మార్పు వచ్చింది.  ప్రకృతినించి ఎదురయ్యే అనర్ధాలు అరికట్టాయి. వ్యక్తుల్లో కూడా ధైర్యం, బలం, నిజాయితీ వంటి గుణాలు అబ్బాయి. 
స్వామి తెజోమయానంద మాటల్లో "వీర హనుమంతునిలో అన్ని సుగుణాలు వున్నాయి. భక్తీ, అంకితభావం, సేవ తత్పరత, వీరత్వం, మానవత్వం,  విజ్ఞాన ఖని ... చెబుతూవుంటే ఇంకా ఎన్నో విశేష వ్యక్తిత్వ గుణాలు కనబతాయి. "


వీరాంజనేయుడిగా పిలువబడే ఈ విగ్రహం వీరాసన స్థితిలో వుంటుంది. ఈ ఆంజనేయ స్వామికి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక సారి మస్తాకాభిషేకం జరుగుతుంది. ఈ సంవత్సరం (2012) అక్టోబర్ నెలలో జరిగిన ఉత్సవానికి నేను   వెళ్ళటం జరిగింది. ఏంతో  కన్నుల పండుగగా ఆ ఉత్సవం వేద పండితుల  మధ్య మూడు రోజులపాటు జరిగిన విశేష కార్యక్రమానికి ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన  వేలాది మంది భక్తుల మధ్య ఆ హనుమంతునికి అభిషేకం జరిగింది. 
puja kosam sidhamga vunna mud kalasaas
భారతదేశం నలుమూలనుంచి పవిత్ర నదీ జలాలను తెచ్చి 1008 కలశాలతో అభిషేకించారు. తొలుత బంగారు కలశం తోనూ  తరువాత వెండి, ఇత్తడి, రాగి, మట్టి కలశాల తో 1982లో స్వామి చిన్మయానందచే వేదోచ్చారణల మధ్య తోలి అభిషేకం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి మహా మస్తకాభిషేకం జరుగుతూంది. అభిషేకానంతరం ఆంజనేయస్వామిని అందంగా అలంకరించి ఆ పవన సుతునికి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది. మన తెలుగు వారు వందల సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
ఈ ఆశ్రమం లో సీతారాముల గుడి, శివాలయం వున్నాయి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆరుగంటలకు ఆరతి జరుగుతుంది. 
మేము ఈ విశిష్ట కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు అక్కడికి చేరుకున్నాము. 
ఎలా చేరుకోవాలి ?
అక్కడికి వెళ్ళాలంటే ముందుగా ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి  రాత్రి 8.00 గం|| రైల్లో బయలు దేరితే ఉదయం 5 గం|| కల్లా   పఠాన్ కోట్ చేరుకుంటాం.  అక్కడి నుంచి మూడు గంటలలో టాక్సీ కానీ, బస్సు లో కాని సిద్ధబారిలోని సాందీపని (తపోవన్)ఆశ్రమంకి చేరుకోవచ్చు. ఈ ఆశ్రమం నుంచి కూడా హిమాచల్ ప్రదేశ్ లోని ఇతర పవిత్ర తీర్ధ యాత్రలకి చేరుకోవచ్చు. ఆశ్రమం నుంచి కూడా టూరిస్ట్ వాళ్ళు యాత్ర సదుపాయాలను కల్పిస్తారు.
Beautiful scenerary
మేము అక్కడ వున్న పది రోజుల్లోనూ స్వామి తెజోమయానందచే వారం రోజులు నారద భక్తీ సూత్రాలు ప్రవచనాలు జరిగాయి.  
మనకున్న సమస్యలు, గజిబిజి జీవితం ఉరుకు పరుగుల దినచర్యల నుంచి దూరంగా పవిత్రమైన దేవ భూమి ఒడిలో అన్ని మరిచి గడపటం ఒక మధురమైన అనుభూతి.  వీలయితే ప్రతి ఒక్కరు చూసి తీరవలసిన ప్రదేశం  హిమాలయ దర్శనం.
 ఈ ఆశ్రమంలో స్వామి చిన్మయానంద నిర్యాణానంతరం 
ఒక ఆలయం నిర్మించారు. ఇక్కడే వారి దివ్య సమాధి వుంది.
Pujya gurujis statue at temple
ప్రతి రోజు ఇక్కడ ఆరతి పూజాదికాలు నిర్వహిస్తారు. 


Pujya Guruji's Divya Samadhi at Ashram

Scenic View From Tapovan Ashram, Sidhabari

From Ashramam