30, జనవరి 2012, సోమవారం

జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి


   
నేడు జాతిపిత   మహాత్మా  గాంధీ  వర్థంతి

    ఈ రోజు మన జాతిపిత మహాత్మా గాంధీ మనకి దూరమైన రోజు.



జాతిపిత బాపూజీ   సరిగ్గా  అరవై మూడు సంవత్సరాల క్రితం ఈ రోజు 
ఓ దుండగుడు నాధూ రామ్  గాడ్సే చేతిలో హతమైన రోజు.
జాతి యావత్తూ సోక  సంద్రం లో మునిగిన రోజు
వారి జీవితం లో అందరం కొన్ని సంఘటనలు అయినా తలుచుకునే రోజు   
గాంధీ జననం               
              "మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబర్ 2వ తేదీన (శుక్ల నామ సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం) గుజరాత్ లోని పోర్ బందర్ లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించారు . ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి  పుత్లి బాయి.
గాంధీగారి  విద్యాభ్యాసం  పోర్బందర్ లోను, రాజ్కోట్ లోను జరిగింది 



గాంధీజీ కి పదమూడు సంవత్సారాల వయసు లోనే కస్తుర్బాతో  1882 లో  వివాహం జరిగింది.
ఈ దంపతులకి  నలుగురు పిల్లలు  (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ).
ఆ తరువాత 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళారు 1891లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగి వచ్చారు  న్యాయ వాద వృతి స్వీకరించిన ఆ తరువాత దక్షిణ ఆఫ్రికా లో ఒక సంవత్సం లా కంపెనీ లో కాంటాక్ట్ ఉద్యోగం లభించింది.



గాంధీజి ఒక సంవత్సరం అనుకున్నవారు ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు (1893 -1914)  వరకు ఆఫ్రికాలో వున్నారు. అక్కడే వారికి జాతి వివక్షత ఎదురయ్యింది. కేవలం తెల్లవాడు కానందువల్ల వారిని రైలు బండి మొదటి తరగతి పెట్టె లోంచి నెట్టివే సారు. అక్కడి హోటళ్ళలోకి రానివ్వలేదు ఇటువంటి ఎన్నో సంఘటనలు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి ఇటువంటి  వాటిని ఎదుర్కోవలసిన బాధ్యత వుందని గ్రహించారు,  గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీ, ఆయన ఆలోచనా సరళి పరిపక్వము కావడానికీ, రాజకీయ విధి విధ నాలు రూపు దిద్దుకోవడానికీ ఇది చాలా ముఖ్యమైన సమయము. ఒక విధముగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి.భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ,  అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయటం  ఆయన చేసిన మొదటి పని.   
వీరు అనేక ఆధ్యాత్మిక గ్రంధాలు చదవటం వలన వారి   ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపేవి . అందులో భగవద్గీత. గీతా పఠనం వల్ల ఆయనకు ఆత్మజ్ఞానము యొక్క ప్రాముఖ్యతా, నిష్కామ కర్మ విధానమూ వంటబట్టాయి. అన్ని మతాలూ దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని కూడా ఆయన గ్రహించారు. దక్షిణాఫ్రికాలో "ఫీనిక్స్ ఫార్మ్", "టాల్ స్టాయ్ ఫార్మ్" లలో ఆయన సామాజిక జీవనాన్నీ, సౌభ్రాత్వత్వాన్నీ ప్రయోగాత్మకంగా అమలు చేసారు ఇక్కడ వ్యక్తులు స్వచ్ఛందంగా సీదా సాదా జీవితం గడిపేవారు - కోరికలకు కళ్ళెం వేయడమూ, ఉన్నదేదో నలుగురూ పంచుకోవడమూ, ప్రతి ఒక్కరూ శ్రమించడమూ, సేవా దృక్పథమూ, ఆధ్యాత్మిక దృక్కోణమూ
గాంధీజీ కుటుంబం 
 ఈ జీవితంలో ప్రధానాంశాలు. గాంధీ స్వయంగా పంతులుగా, వంటవాడిగా, పాకీవాడిగా ఈ సహజీవన విధానంలో పాలు పంచుకొన్నారు.

.              ఈ సమయంలోనే ఆయన అస్పృశ్యతకూ, కులవివక్షతకూ, మతవిద్వేషాలకూ ఎదురు నిలవడం బోధించారు . విపరీతమైన జనాదరణ పొందారు.  క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం ఆయన మార్గము. పోరాటాలూ, సంస్కరణలూ ఆ జీవితంలో ఒక భాగము. ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి, మరొక అన్యాయాన్ని సహించడం ఆయన దృష్టిలో నేరము.1914లో గాంధీ భారతదేశానికి తిరిగి వచారు  .భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది. .ఆ తరువాత వ్రుధంగా జాతీయోధ్యమాల్లో పాల్గొన్నారు.
స్వతంత్ర సిదికై విదేశి వస్తు బహిష్కరణ, స్వదేశి వస్త్ర ధారణ ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్, జాతీయ విద్య మొదలైన ఉద్యమాలు జరిగాయి.
భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో పాల్గోనసాగారు 1924 లో భారత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా వున్నారు. బెల్గావ్ (కర్ణాటక) లో జరిగిన  39  వ అఖిల భారత సమావేశాల్లో ప్రెసిడెంట్ గా వున్నారు.    ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ కివెన్ను దన్నుగా నిలిచారు. 
1921  లో   ఆంధ్ర దేశ పర్యటన చేసారు  వారి  ఉపన్యాసాల కి విశేష స్పందన లభించింది
 ఎందఱో ఉదారంగా విరాళాలు అందిచారు. మహిళలు తమ నగలను ఒలిచి ఇచ్చారు గాంధీజి స్ఫూర్తి తో దేశమంతా  
 ఏక తాటి మీద నిలిచింది.  
సబర్మతి ఆశ్రమం 


సబర్మతి ఆశ్రమం 
గాంధీ ఆశ్రమం , హరిజన ఆశ్రమం, సబర్మతి ఆశ్రమం ఎలా పిలచిన ఒకటే. గుజరాత్ లోని అహమదాబాద్ దగ్గర సబర్మతి నది ఒడ్డున ఈ ఆశ్రమం  నెలకొల్పబడింది.   దండి మార్చ్ ఇక్కడినుంచే ప్రారంభమైంది అందుకే ప్రస్తుతం దండి మార్చ్ గుర్తుగా దీనిని గుర్తిస్తున్నారు.   వేలాది మంది బ్రిటిష్ వారి పన్నుల విధానానికి నిరసనగా దండి మార్చ్ లో పాల్గొన్నారు. 
గాంధీ చరఖా 
ఉద్యమాల పోరులో గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రు సుభాస్ చంద్ర బోస్, వల్లభి పటేల్ ఇంకా ఎందఱో దేశ నాయకులు పాల్గొన్నారు. జైళ్ళకి వెళ్లారు. వీరంతా సంవత్సరాల తరబడి జిల్లాల్లో మగ్గారు.

తెల్లవారి పాలనకి విముక్తి కలగటానికి క్విట్ ఇండియా ఉద్మమం చివరిది అది ఎంతో దోహదం చేసింది. ఆ తరువాత గాంధీజీ ఇంగ్లాండ్ కి రౌండ్ టేబుల్ సమావేశంకి   ఏకైక ప్రతినిధిగా హాజరయ్యారు.కాని ఆ సమావేశం అంతగా సఫలం కాలేదని చెప్పచ్చు ఆ తరువాత నిరాహార దీక్షలు,  కారాగార వాసాలు ఎక్కువయ్యాయి.
      బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942 లో "క్విట్ ఇండియా" ఉద్యమం ప్రారంభమైంది."క్విట్ ఇండియా" ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులూ, అరెస్టులూ, హింసా పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపసాగాయి. ఈ సమయంలో గాంధీ చిన్నచిన్న హింసాత్మక ఘటనలున్నా ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేసారు .










 "భారత్ ఛోడో"- భారతదేశాన్ని వదలండి - అన్నది నినాదము."  డూ ఆర్ డై"  "కరో యా మరో" - చేస్తాం, లేదా చస్తాం - అన్నది అప్పటి నిశ్చయము. ప్రభుత్వము కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది. ఈ సందర్భంలో 1942  లో అరేస్ట్   అయిన  గాంధిజీ పూనా జైలు లో ఉండి 1944  లో విడుదలయ్యారు. కాని కస్తూరిబా గాంధీ పది నెలల కారాగార వాసం తరువాత మరణించారు.
       1946లొ స్పష్టమైన  బ్రిటిష్ కాబినెట్ మిషన్ ప్రతిపాదనకి వచ్చినపుడు గాంధీజీ అంగీకరించలేదు. కాని కాంగ్రెస్ వారు గాంధీజీ మాటను తోసి పు చ్చారు నెహ్రు తదితరులు. ఆ తరువాత జరిగిన దేశ విభజన  జరిగి దేశం పాకిస్తాన్ ఇండియా రెండుగా చీలిపోయింది  దేశ విభజన కి గాంధీజీ వ్యతిరేకించారు. కాని . ఆ సమయం లో  జరిగిన హింసా కాండలో దాదాపు ఐదు వేల మంది మరణించారు.
       చివరికి  మన దేశానికి 1947 ఆగస్ట్ 15 న స్వాత్రంత్యం లభించింది. ఆ రోజు దేశమంతా  సంబరాలు జరుపు కుంటుంటే గాంధీజీ మాత్రం కలకత్తాలో ఒక హరిజన వాడను శుభ్రం చేస్తూ గడిపారు. మత విద్వేషాలు మారణ కాండ వారిని ఎంతో బాధ పెట్టాయి.

గాంధీజీ చివరి ఫోటో 
గాంధీజి  హత్య

1948 జనవరి  20  వ తేదిన మొదటిసారి గాడ్సే బృందం తో హత్య ప్రయత్నం జరిగింది. దానికి గాంధిజీ "వాళ్ళు పిల్లలు! వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. నేను పొయ్యక గుర్తుకు తెచ్చుకుంటారు, ఆ ముసలాడు సరిగానే చెప్పాడని" అని అన్నారు.
1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్ధనా సమావేశానికి వెళ్తుండగా ఆయనను  నాధూరాం  గాడ్సే   కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ"హే రామ్" అన్నాడని చెబుతారు. ఢిల్లీ రాజఘాట్ లో అతని సమాధి మరియు స్మారక స్థలమైన  రాజఘాట్ వద్ద ఈ మంత్రమే చెక్కి ఉన్నది.  
కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించారు.  మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యులు.  
సామాన్యుడి చేతికి సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించి, అహింసే పరమ ధర్మమని విశ్వసించి, మూర్తీభవించిన శాంతంగా పేరొందిన గాంధీజి 



" సర్వజన హితం నా మతం .అంటరాని తనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే 
నా ఆయువు అంకితం"   -   అనే గాంధీ గారి సందేశం నేడు అందరు గుర్తించాల్సిన విషయం.
ఆ మహాత్ముని ఈ రోజైనా స్మరించుకోవటం భారతీయులుగా మనందరి ధర్మం.





జై హింద్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి