2, ఫిబ్రవరి 2016, మంగళవారం

నేనూ ఓటేశా


 నేనూ  ఓటేశా...
(ఓటు  భాగోతం)
ఇంతకీ ఈ  పోస్ట్  ఉద్దేశం  ఎలక్షన్ లలో పాల్గొనే  నాయకులు  పంపిన  రాంగ్  మెసేజ్  పంపటంతో  మేము పడిన పాట్లు   నిన్న  జరిగిన హోరాహూరీ  ఓట్ల పోరులో  ఉదయం  9.30 కి కొండాపూర్ నుంచి బయలు దేరి  ఓటు వేయడానికి  వెళ్ళాము.   మాకందరికి  ముందే  మెసేజ్ వచ్చింది.  ఎలక్షన్ బూత్ నెం.  సీరియల్  నెం.  అన్నీ సెంటర్ కూదా మెసేజ్లో ఇచ్చారు.  ఎప్పుడూ  వుండే రెడ్డి కాలేజీ  కాకుండా  venue  మారింది  అనుకుంటూ  direct గా venue కి  వెళ్ళాము.   దూరం గా కారు పార్క్ చేసి  నడుచుకుంటూ  వెళ్ళాం.   అక్కడ వున్న అన్ని పోలింగ్ బూత్ లు వెతికినా  మా వోట్లు  లేవు.  ప్రతి వోక్కరికి  మెసేజ్ చూపించటం  అక్కడ లేదు అంటే వేరే పార్ట్ నం..50   కి వెళ్లి   లిస్టు లో చూడటం.... చివరికి అక్కడ లేదు  అని తేల్చుకుని  పాత ఎలక్షన్ సెంటర్  కి వెళితే అక్కడ వుంది మా వోటు.   చివరికి గంట పైగా వెతికితే  దొరికింది. దగ్గరలో వున్న  టేబుల్ దగ్గర వున్నా వాళ్ళు  మెసేజ్  వస్తే  డైరెక్ట్ గా వెళ్ళండి.  స్లిప్ అక్కర లేదు అని అన్నారు. 
  • ఇక ఈ సారి మున్సిపల్  ఎలక్షన్ లలో  రష్  అసలు లేదు.  మేము డైరెక్ట్ గా పోలింగ్  కౌంటర్ లోకే వెళ్ళాము. 
  • ఎక్కడా రోడ్లమీద  కాని , పోలింగ్  centres లోకాని  voters  కనిపించ లేదు. 
  • చాలా తక్కువ  శాతం ఓట్లు పోలయ్యాయి ఈసారి.
  •  ఎక్కడా contestents  పేర్లు, వారి  గుర్తులు  వున్న  display  boards లేవు.   చదువుకున్న వారూ,  చదువుకోలేని వారూ  అంతా  ముఖ్యమైన  పార్టీ గుర్తులు  గుర్తు పెట్టుకుని  దాని మీద   ఎలక్షన్ మిషన్  లో  ప్రెస్ చేశారు.

ఇదీ వోటు  భాగోతం....





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి