సమీక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సమీక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, అక్టోబర్ 2017, ఆదివారం

జ్ఞాపకాల జావళి - పొత్తూరి విజయలక్ష్మి

"మధుర జ్ఞాపకాల జావళి -
                       మదిని నింపే మధురానుభూతి!" 
                                                                                                 

                                                             మణినాథ్ కోపల్లె 
            
                ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కలం నుంచి వచ్చిన మరో పుస్తకం జ్ఞాపకాల జావళి. ఇందులో వారి శ్రీవారి ఉద్యోగ రీత్యా చిత్తరంజన్ లో గడిపిన అనుభవాలను మన కళ్ళ ముందుంచారు.  ఇందులో   70 వ్యాసాలు  వున్నాయి. ప్రతి జ్ఞాపకమూ వారితో పాటు మనమూ అనుభవిస్తుంటాము.  ఇందులో రోలు నుంచి జాతీయ సమస్యలు, దేశ సరిహద్దుల్లో    యుద్ధాలూ ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలు  తన జ్ఞాపకాలుగా చెప్పారు.  కొన్నిటిలో హాస్యం కూడా ఉంది.   వాక్యాలు కూడా సరళంగా వుండి  తేలిక మాటలతో మనతో మాట్లాడుతున్నట్లే ఉంటాయి.  

                  రైల్వే వారి జీవితాలు ఎలా వుంటాయో చిత్తరంజన్ లో రైలింజన్ల తయారీ, ఆ ఫాక్టరీ విశేషాలు అన్నీ చక్కగా వివరించారు. ఈ పుస్తకం చదివితే రైల్వే ల లో పని చేసే వారి కష్ట సుఖాలు తెలుస్తాయి. చిన్నప్పుడు సోషల్ పుస్తకంలో రైలింజనులు చిత్తరంజన్ లో తయారగును అని ఒక ప్రశ్నకు జవాబుగా చదువుకున్నాం. అంత వరకే తెలుసు చిత్తరంజన్ గురించి.  కాని విజయలక్ష్మి గారి ఈ జ్ఞాపకాల జావళి చదివితే అసలు ఎలా తయావుతాయి రైలింజన్లు, ఆ ఫాక్టరీ, అక్కడి కార్మికులు, ఇలా ఎన్నో విషయాలు మన కళ్ళముందుంటాయి.  

                 మన తెలుగువారి ఆత్మీయతలు పిలుపులు, మన ఆంధ్రాలోనే కాదు  పరాయి రాష్ట్రమైన చిత్తరంజన్ ఎలా ఉంటాయో  తెలిపారు ఆ వూరిలో  తెలుగువారు అనే జ్ఞాపకంలో...  ఆ వూరిలో ముగ్గు ఉంటే, మార్కెట్లో దొండ కాయలు కొంటె తెలుగు వారని ఒకరినొకరు పలకరించు కునే వారుట....  ఎవరికీ ఏ  అవసరం అయినా అందరూ కలిసి కట్టుగా ఉండి సాయం చేసుకుం తారుట.  చేబదుళ్ళు కూడా అవసరాన్ని బట్టి ఒకరికొకరు సాయం చేసుకునే వాళ్ళం అని అంటారు. 

             మేళాలు, జాతరలు జరిగినపుడు వినోదాలు, షాపింగులులే కాదు విందులు కూడా కావాలి.  అక్కడ వున్న నార్త్ ఇండియన్ డిషెస్ తో పాటు మన తెలుగు వారి స్పెషల్ అయిన దోసె అంటే అక్కడి వారికి ఎంత ఇష్టమో ఇందులో తెలియ చేశారు.  70 కిలోల దోశ పిండి   అంటే మాటలా.. అంత పిండి తో దోసెలు వేయటం ,అయినా రద్దీకి తట్టుకోలేక పోవటం, పెద్ద పెద్ద ఆర్డర్ లు, మొహమాటాలు, ఆ రాకాసి అని పేరు పెట్టిన 'దక్షిణ' అనే స్టాల్ ప్రహాసంలో వివరించారు.  ఆ దోసెలను  మనమూ   క్యూ లో నుంచుని తినాలనిపిస్తుంది చదువుతుంటే.... 
              సరదాగా రాసే కబుర్లతో పాటు జాతీయ విపత్తులు గురించి కూడా ప్రస్తావించారు విజయలక్ష్మి గారు.   పాకిస్థాన్ తో 1971 లో జరిగిన యుద్ధం... బంగ్లాదేశ్ ఆవిర్భావం... తో పాటు ఆనాటి యుద్హ పరిస్థితులుచెబుతూ 'యుద్దానంతర వారి వూరిలో ఏర్పడ్డ దుష్పరిణామాలు రెండు మూడేళ్ళ వరకూ వెంటాడాయి' అని అంటారు.  యుద్ధ సమయంలో సరిహద్దు లోనే వున్న చిత్తరంజన్ కు భారీగా వలస వచ్చిన వేలాది మంది తో అతలాకుతలం అయింది ఆ చిన్న వూరు. యుద్ధం ఆగిపోయినా శరణార్థులు తిరిగి వెళ్ళలేదు.  నిరుద్యోగం, ఆకలి కొంత మందిని దొంగలుగా  మార్చింది.  , రైళ్లలోనూ, ఇళ్లలోనూ  విపరీతంగా దొంగ తనాలు జరగటం, నగదుకు, నగలకుసామాన్లకు భద్రతా లేకపోవటం, కాస్త టీ   ఇచ్చినా చాలు ఏదైనా పని చేస్తాం అని ప్రాధేయ పడే వారుట .... ఇలా ఆనాడు జరిగిన పాకిస్థాన్ యుధ్ధ పరిస్థితులు వివరించారు ఈ జ్ఞాపకంలో.... 

             ఇలా ఒకటా రెండా 70 జ్ఞాపకాలను అందించిన ఈ పుస్తకంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు వున్నాయి.  వివాహం అయి శ్రీవారి శివరావు గారి ఉద్యోగ రీత్యా చిత్తరంజన్ లో   గడిపిన వీరి అనుభవాలే ఈ పుస్తకం.  చిన్నప్పుడు రైలు ప్రయాణం చేయాలి అని  ఎంతో సరదా  పడ్డ వీరి జీవితం రైల్వే లో పని చేసే ఇంజనీరు గారితో ముడి పడి ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు మనతో కూడా పంచుకున్నారు.  రైల్వే స్టేషన్ ల అభివృద్ధి, నుంచి రైల్వే ల సమ్మె జరిగితే ఎలా ఉంటుందో...  ఆ ఫాక్టరీ లో జరిగే పరిణామాలు మనముందుచారు .... 
            
            శ్రీమతి మీనాక్షి పోన్నుదురై చిత్తరంజన్ వచ్చినపుడు వారి అనుభవాలు .... ఇలాఎన్నో ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి.
             హాస్య చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ వీరి నవల ప్రేమ లేఖ లోని పాత్రల గురించి శ్రీమతి భట్ మరియు చంటి అనే జావళి లో.  . 'ఆవూరు ఆమనుషులు మా  జీవితాల్లో   ఒక భాగం...' అంటారు.  తల్లి చాటు  బిడ్డగా ఆ వూరిలో అడుగు పెట్టిన వీరు వెళ్ళిన కొత్తలో బెంగాలీ భాష రాక పడిన పాట్లు కూడా ఒక జ్ఞాపకం గా వివరించారు ఇందులో.... ఆ తరువాత   బెంగాలీ భాషతో పాటు ఇంగ్లీషు, హిందీ ధారాళంగా మాట్లాడడమే కాదు, ఏ సమస్యనైనా అలవోకగా పరిష్కరించే నేర్పు సంపాదించారు. రైల్వె  వుమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లో జాయింట్ సెక్రెటరీగా ,  సెక్రటరీ గా ఇలా అనేక పదవులులలో వుండి ఆ ఆర్గనైజేషన్ ద్వారా సమాజానికి ఎన్నో  మంచి పనులు చేసారు.  
     విజయ లక్ష్మి గారు నవ వధువుగా పదిహేడు సంవత్సరాల ప్రాయంలో చిత్తరంజన్ లో అడుగు పెట్టి, అక్కడ  పదిహేడు సంవత్సరాలు అక్కడ గడిపారు.  రైల్వే వారి జీవితం అంటే సుఖాలే కాదు ఎనెన్నో కష్టాలూ వుంటాయని ఈ పుస్తకం ద్వారా మనకి తెలిపారు.          
  ఇంత వరకూ  మంచి పుస్తకం అందించిన పొత్తూరి విజయలక్ష్మి గారి కలం నుంచి మరెన్నో పుస్తకాలు హాస్యంతో పాఠకులను నవ్వుల ఊయలలో ఓలలాడించాలి.   
పుస్తకం పేరు          :     జ్ఞాపకాల జావళి 
రచన                     :     పొత్తూరి విజయ లక్ష్మి 
వెల                        :     150/- రూ.
ప్రచురణ                :      రిషిక పబ్లికేషన్స్ 
పుస్తకం దొరకు చోటు :    అన్ని ప్రముఖ విక్రయ కేంద్రాలు,
                                      శ్రీ రిషిక పబ్లికేషన్స్ 
e-mail                      :      pvlakshmi8@gmail.com 
Ph. No.                    :      040 - 2763 7729


1, ఆగస్టు 2017, మంగళవారం

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తొ




లేఖిని సాంస్కృతిక సంస్థ రచయిత్రులతో శ్రీమతి గళ్ళ రుణ కుమారి గారి ఇంటి విందుకు వెళ్ళిన సందర్భంలో .....















me,  Mines  Minister Galla Aruna Kumari, Vijaya nirmala
Lunch at Galla Aruna Kumari's House, Jubliee Hills, Hyderabad

4, ఫిబ్రవరి 2016, గురువారం

దీప తోరణం - కన్నెగంటి పుస్తక sameeksha

పుస్తక సమీక్ష:
దీపతోరణం
-మణినాథ్ కోపల్లె
ప్రముఖ రచయిత్రి  కన్నెగంటి అనసూయ  రచించిన దీపతోరణం పుస్తకం ఇటీవల లేఖిని సంస్థ అధ్వర్యంలో  ప్రముఖ రచయిత్రుల నడుమ ఆవిష్కరించబడింది.
ఈ దీపతోరణం పుస్తకంలో 15 కథలు వున్నాయి. ఈ కధలన్నీ ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. తన జీవితంలో  ఎదురయ్యే సంఘటనలే కథలుగా మలిచానని అంటారు రచయిత్రి. సాధారణ వ్యక్తులు, సాధారణ విషయాలు, సాధారణ సంఘటనలు వీరి కథాంశాలు.  తండ్రి ప్రేమ కోసం ఆరాట పడే వ్యక్తి వ్యధ పితృదేవోభవ కథలో కనిపిస్తుంది. తండ్రి భుజాలమీద ఎక్కాలనే చిన్న ఆనందం, చెరకుగడలు నాన్నే ముక్కలు చేసి ఇవ్వాలి అనే  కోరిక తీరలేదనేస్వల్ప విషయాలు తండ్రిపై ద్వేషం పెంచుకునేలా చేస్తాయి.   తన బదులు మోతుబరి రైతన్న కొడుకు వంశీకి తన తండ్రి సేవలందించటం  భరించలేకపోతాడు కృష్ణ. చివరికి పట్టుదలతో గురువుగారి బోధనలతో ఆ కసిని చదువు మీద పెట్టి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవటం ఈకథ  చెబుతుంది.     
మరోకథ జీవితాన్ని శాసించేవి కథలో నేడు సమాజంలో దాదాపు చాలా కుటుంబాలు ఎదుర్కుంటున్న సమస్యలే. చిన్న ఇంటిలో ఉన్న సుఖం పెద్ద ఇంటిలో ఏమి కోల్పోతామో చెబుతుంది. కొత్త ఇల్లు, పెద్ద ఇల్లు మనిషికో గది  పేరిట పిల్లలు ఆత్మీయతానురాగాలు కోల్పోయి తమ తమ ప్రపంచంలో మునిగిపోయి ప్రవర్తించే తీరు, ఇల్లు విశాలమయితే మనసులు ఇరుకు లాగా తయారయి చివరికి మళ్ళీ పాత చిన్న ఇంటికి మారిపోవాలని నిర్ణయించుకోవటం కథకి ముగింపునిస్తారు రచయిత్రి.
ఆమాత్రం చాలు కథలో సాధారణంగా గృహిణులు ఏదైనా వస్తువు కొనేటప్పుడు తీసుకోవాల్సిన విషయాలు చెబుతుంది. మా దగ్గర ఈ వస్తువు తక్కువ అని షాపు వాళ్ళు చెప్పే మోజులో అసలు బిల్ తీసుకోకుండా కాగితం మీద ఇచ్చి న బీల్ తీసుకోవటం , కొన్న వస్తువులు త్వరగా పాడయిపోవడం, వంటి అనుభవాలు చాలామందికి అనుభవమే.
ఎవరు మురికి ఏది మురికి కథలో అంటరాని వాళ్ళు అని వేరుగా చూసే వ్యక్తుల రక్తమే అవసరానికి రక్తం ఎక్కించినపుడు ఈ ప్రశ్న ఉదయిస్తుంది. మనుషులంతా ఒకటే... ఎవరూ ఎక్కువా తక్కువా కాదు అనే పాఠం చెబుతుంది ఈ కథాంశం.
అమ్ముమ్మ కానుక కథలో తన మనవరాలి కి ఇవ్వబోయే కానుక కోసం దాచిన డబ్బుని ఆమె ప్రామిసరీ నోట్లు రాసే   కాలం గడిపిన దశరధరామయ్య తాత మనవరాలికి కానుకగా ఇవ్వడం ... అలాగే ఉచితంగా ఇచ్చే గొడుగులు వద్దని విద్యార్థులంతా వెళ్ళిపోయినా బూశమ్మ ఒక్కతే ఉచితంగా ఇచ్చే ఆ గొడుగు కోసం ఎదురు చూడ్డం, దానికి కారణాలు ఆ చల్లని నీడ కథలో చెబుతాయి... ఙ్ఞాపకం జీవించిన వేళ కథలో మనిషి ఙ్ఞాపకాలు చిన్ననాడు సీతాపలపళ్ళు అమ్మే తాతని, అమ్మాయిగారిని కలపటం తో ముగుస్తుంది.
 ఇలా ప్రతి ఒక్క కథా సామాజిక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిందే... ఇంకా ఎన్నో కథలున్నాయి.
కన్నెగంటి పుట్టిన పశివేదల గ్రామ పరిసరాలు, ఆత్మీయతానురాగాలు, పల్లె వాతావరణం,  ఇవన్నీ ఆమె కథలలో తొంగి చూస్తాయి.  కన్నెగంటి అనసూయ మూడవ కథల సంపుటి ఈ పుస్తకం. రచయిత్రి గానే కాదు స్వచ్ఛంద సంస్థని స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో పేరు సంపాదించుకున్నారు,   సమాజ సేవ చేస్తున్న రచయిత్రి కథలని విశిష్ఠ రచనలు, హృదయానికి హత్తుకునేవి అని ప్రముఖ రచయిత మునిపల్లె రాజుగారు అభివర్ణించారు.

    “దీపతోరణం  కథానికలు
రచన  : కన్నెగంటి అనసూయ
పేజీలు  :   177        ధర  : 120/-
For Copies :    Kanneganti Anasuya
406, Vindhya 4
Kukatpally ‘Y’ Junction,
Jaya Bharathi Gardens, Kukatpally, Hyderabad 18



2, ఫిబ్రవరి 2016, మంగళవారం

నేనూ ఓటేశా


 నేనూ  ఓటేశా...
(ఓటు  భాగోతం)
ఇంతకీ ఈ  పోస్ట్  ఉద్దేశం  ఎలక్షన్ లలో పాల్గొనే  నాయకులు  పంపిన  రాంగ్  మెసేజ్  పంపటంతో  మేము పడిన పాట్లు   నిన్న  జరిగిన హోరాహూరీ  ఓట్ల పోరులో  ఉదయం  9.30 కి కొండాపూర్ నుంచి బయలు దేరి  ఓటు వేయడానికి  వెళ్ళాము.   మాకందరికి  ముందే  మెసేజ్ వచ్చింది.  ఎలక్షన్ బూత్ నెం.  సీరియల్  నెం.  అన్నీ సెంటర్ కూదా మెసేజ్లో ఇచ్చారు.  ఎప్పుడూ  వుండే రెడ్డి కాలేజీ  కాకుండా  venue  మారింది  అనుకుంటూ  direct గా venue కి  వెళ్ళాము.   దూరం గా కారు పార్క్ చేసి  నడుచుకుంటూ  వెళ్ళాం.   అక్కడ వున్న అన్ని పోలింగ్ బూత్ లు వెతికినా  మా వోట్లు  లేవు.  ప్రతి వోక్కరికి  మెసేజ్ చూపించటం  అక్కడ లేదు అంటే వేరే పార్ట్ నం..50   కి వెళ్లి   లిస్టు లో చూడటం.... చివరికి అక్కడ లేదు  అని తేల్చుకుని  పాత ఎలక్షన్ సెంటర్  కి వెళితే అక్కడ వుంది మా వోటు.   చివరికి గంట పైగా వెతికితే  దొరికింది. దగ్గరలో వున్న  టేబుల్ దగ్గర వున్నా వాళ్ళు  మెసేజ్  వస్తే  డైరెక్ట్ గా వెళ్ళండి.  స్లిప్ అక్కర లేదు అని అన్నారు. 
  • ఇక ఈ సారి మున్సిపల్  ఎలక్షన్ లలో  రష్  అసలు లేదు.  మేము డైరెక్ట్ గా పోలింగ్  కౌంటర్ లోకే వెళ్ళాము. 
  • ఎక్కడా రోడ్లమీద  కాని , పోలింగ్  centres లోకాని  voters  కనిపించ లేదు. 
  • చాలా తక్కువ  శాతం ఓట్లు పోలయ్యాయి ఈసారి.
  •  ఎక్కడా contestents  పేర్లు, వారి  గుర్తులు  వున్న  display  boards లేవు.   చదువుకున్న వారూ,  చదువుకోలేని వారూ  అంతా  ముఖ్యమైన  పార్టీ గుర్తులు  గుర్తు పెట్టుకుని  దాని మీద   ఎలక్షన్ మిషన్  లో  ప్రెస్ చేశారు.

ఇదీ వోటు  భాగోతం....





24, డిసెంబర్ 2015, గురువారం

Book Fair

పుస్తకాల  పండగ డిసెంబర్  2015
NTR GROUNDS లో  Book Fair జరుగుతోంది.
ఈ సందర్భంగా ప్రమదాక్షరి  స్టాల్  లో నేను రాసిన ఫ్రీడం ఫైటర్ కోపల్లె హనుమంత రావు గారి  చరిత్ర పుస్తకం కూదా వుంది.  ఆ రోజుల్లో దేశ భక్తి వెల్లువలా దేశమంతా పారుతున్న వేళ మన ఆంధ్రా దేశం లోనూ అందునా మచిలీపట్టణం లో  ఎంతో మంది వీరులు ఉద్యమాల్లో పాల్గొన్నారు .  అందులో హనుమంత రావు గారు గారు, పట్టాభి గారు, ముట్నూరి గారు తెలుగు నాట తోలి విద్యాలయాన్ని స్తాపించి ఎందరికో విద్యాదానం చేశారు.  నేటికి అది వట వృక్షమై మచిలీపట్టణం లో నిలిచి వుంది.
ఈనాటి Book Fair లో ఈ పుస్తకం  ప్రముఖుల చేతుల్ల్లోను, ప్రముఖు రచయిత్రుల పుస్తకాల వరసన, వుంది. సాహిత్యాల కార్యక్రామాల్లోను పాల్గొన్న నేను,  నా  తోటి రచయిత్రుల తో ఫోటోలు ...




గులాబీ రంగు దుస్తుల్లో ప్రముఖ రచయిత్రులు - ప్రమాదక్షరి సభ్యులు  


ట్రావేలోగ్స్  - చర్చా కార్యక్రమం లో నా అనుభవాలు వింటున్న ప్రముఖ రచయిత్రులు 
చివరి రోజు 27 12 2015  బుక్ ఫెయిర్ లో తోటి రచయిత్రులతో ....
వి. బాలా మూర్తి గారు, వాసా ప్రభావతి గారు, గంటి భానుమతి గారు, మణి


రచయిత్రులు నిలుచున్న వారు : డి కామేశ్వరి , ఆలూరి  గౌరీ లక్ష్మి , అత్తలూరి విజయలక్ష్మి,
గంటి సుజల, జ్యోతి వలబోజు, మణి కోపల్లె . మణి  వడ్లమాని
కూర్చున్నవారు: ముక్తేవి భారతి , పి. యస్. లక్ష్మి ,  తమిరశ జానకి  ,  




చివరి రోజున  బుక్ ఫెయిర్ లో పుస్తకాభిమనులందరు విచ్చేశారు.  ప్రాంగణం అంతా విపరీత మైన  రద్దీ ...  ఈ  సారి ఎక్కువగా పిల్లలు, విద్యార్ధులు, కాలేజీ విద్యార్ధులు, ఎక్కువగా  కనిపించారు.   అందరూ వారి వారి బడ్జెట్ ని పట్టి  పుస్తకాలు కొనుగోలు చేసారు.   పిల్లలకి కొంతమంది ఆటల పోటీలు, వక్తృత్వ పోటీలు , వంటివి నిర్వహిస్తే,  కొంతమంది ఉచిత పిల్లల అనిమేషన్ cd లు అందించారు.  

         ఈసారి ఎక్కువ మంది విజిటర్స్ వచ్చారు.  అలాగే పుస్తకాల సేల్స్  కూడా చాలా బాగా పెరిగాయి.  ఒక్క ప్రమదాక్షరి స్టాల్ లోనే  లక్ష పైగా అమ్మకాలు జరిగాయి .  పోటీ పరీక్షల పుస్తకాలు యువత కొంటే, ఆధ్యాత్మిక పుస్తకాలు  వయసు మళ్ళిన వారు కొన్నారు.  పది రోజులు జరిగిన పుస్తకాల పండుగ లో వచ్చిన వారు, పుస్తకాల అమ్మకాలు చూస్తుంటే ... పుస్తకాలకి మళ్ళీ పునర్ వైభవం వచ్చిందని పించింది.  చదివే వారు  ఎక్కువ అయ్యారు..  

6, డిసెంబర్ 2015, ఆదివారం

స్వాతి వార పత్రిక - చివరి రోజుల్లో

కోపల్లె హనుమంత రావు
స్వాతి వార పత్రిక 11 12 2015 లో స్వాత్రంత్ర సమర యోధులు, జాతీయ  విద్యా పరిషత్  వ్యవస్తాపకులు బందరు వాస్తవ్యులు కీ. శే.   కోపల్లె హనుమంతరావ్  గారి గురించి  రాసిన ఆర్టికల్  వచ్చింది .  


బందరు (మచిలీపట్టణం ) లోని తోలి జాతీయ విద్యా పరిషత్ వ్యవస్తాపకులు, తోలి ప్రిన్సిపాల్  అయిన కోపల్లె హనుమంత రావు గారు  విద్యతో  పాటు వృత్తి విద్యా విధానాన్ని  ప్రవేశ పెట్టిన జాతీయ వాది.  జమిందారి వంశంలో పుట్టినా , చల్లపల్లి జమీలో దీవాన్ గా చేసి న్యాయవాది గా ప్రసిద్ది పొందిన తండ్రి కృష్ణారావు గారి బాటలో నడిచి న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న రొజులవి.  ఆ రోజుల్లో జాతీయోద్యమం ఊపిరి పోసుకుని భారత జాతీయ నాయకులు లాల్, పాల్, బాల  త్రిమూర్తుల స్ఫూర్తి, ఉపన్యాసాలు, మహాత్ముని అంధ్ర పర్యటన ....  ఇలా ఎన్నో  స్వాత్రంత్ర పోరాటా నికై దేశం యావత్తూ  కదన రంగాన తెల్ల వారికి ఎదురు నిల్చి, వారిని తరిమి కొట్టే పోరాటాలు  సాగుతున్న సమయం లో హనుమంత రావు గారు తన మిత్రులు పట్టాభి, ముట్నూరు ల సాయంతో బందరు లో జాతీయ విద్యా పరిషత్ ని స్తాపించారు. 
కోపల్లె హనుమంతరావు గారు తన లాయరు పట్టాను చించి వేసి,  జాతీయ ఉద్యమాల బాట పట్టారు.  కలంకారి నేత, చిత్రలేఖనం , మెకానిజం, వడ్రంగి, ఇలా ఎన్నో వ్రుత్తి విద్యలను  కళాశాలలో నేర్పించారు.ఎందరికో జీవన బృతిని  అందించారు. ప్రక్రుతి ఆరాధకులు, నిరాడంబరుడు అయిన కోపల్లె వారి  జీవిత చరిత్ర ఆధారంగా స్వాతి వార పత్రిక లో ప్రముఖ వ్యాస కర్త వ్రాసిన వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. 
 ఈ కళాశాల  నుంచి ఎందరో సాహితీ మూర్తులు, చిత్రకారులు, (అడవి బాపిరాజు వంటి వారు) ఇక్కడ చదువుకి పైకి వచ్చారు.  




30, అక్టోబర్ 2015, శుక్రవారం

"విధిని ఎదిరిస్తున్న వీధి బాలలు , పేద పిల్లలు -


పుస్తక సమీక్ష:


 "విధిని ఎదిరిస్తున్న వీధి బాలలు, పేద పిల్లలు"    
(బాలల కోసం మరో చిరు పుస్తకం)
-డా . గురజాడ  శోభా పెరిందేవి
                                                                                               -మణి నాథ్ కోపల్లె 
    
                   ప్రముఖ రచయిత్రి డా.  గురజాడ శోభా పేరిందేవి రచించిన "విధిని ఎదిరిస్తున్న వీధి బాలలు, పేద పిల్లలు "  అనే పుస్తకం అందరు చదవతగినది. ఇందులో పేద పిల్లలు, అనాధ పిల్లలు. వీధి పిల్లలు అనుభవించే బాధలు, అనుభవాలు, అనుభూతులు తెలియ చేయటం తో పాటు,  వారికి ఆశ్రయం ఇచ్చి ఆడుకునే సంస్థల గురించి వివరించారు.
       'అప్నాఘర్' అనే సంస్థను  అభినందన భవానీ గారు గత 25 సం. గా పేద పిల్లల కి నిలువ నీడ నిచ్చి, చదువులు చెప్పిస్తూ, భోజన సదుపాయాలూ చూస్తూ, వారి భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చి దిద్దుతున్నారు.  అప్నాఘర్ గురించి, అందులోని పిల్లల దీన గాధలు, ఆ సంస్థ ఎదుర్కున్న సమస్యలు, అన్ని విపులంగా రచయిత్రి ఈ పుస్తకం లో వివరించారు.  సంఘంలోని దీన, హీన,పేద పిల్లలకు వారు విధిని పూర్తిగా  ఎదిరించలేక పోయినా 'అప్నాఘర్ సంస్థ' వారి జీవితాల్లో నిండిన ఆర్ధిక, సామాజిక మార్పుని తీసుకుని వచ్చే ప్రయత్నంలోను,  ఎందరో అందించే ఆర్ధిక వనరులు, విద్యా సదుపాయాలు కుడా హర్షణీయమే! వాటినన్నిటిని రచయిత్రి చక్కగా ఇందులో వివరించారు.  అవకాశం  వుంటే ఎవరైనా ఏదైనా సాధించ గలరని,  అనాధలైనా, పేదలైనా హద్దులుండవని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడగాలరని ఈ అప్నాఘర్ విద్యార్దులు నిరూపించారు. కొందరు వీధి పిల్లలు సిగరెట్, మద్యం , డ్రగ్స్ వంటి వాటికి బానిసలై అవారాలా  తిరిగే వారుంటే మరికొందరు వివిధ వృత్తులలో పట్టుదలతో రాణిస్తూ పైకి వచ్చిన పిల్లలూ వున్నారు అని వారి వివరాలూ ఈ పుస్తకం లో అందించారు. మనదేశం లోనే కాదు ప్రపంచం లో వున్న పేద పిల్లల గురించిన వివరాలూ వున్నాయి.  వీధి బాలల గురించి చెబుతూ వారిలో పట్టుదల వుంటే జీవితంలో పైకి వచ్చిన వారున్నారు, ముళ్లబాటలో నడిచిన వారున్నారు అని అంటున్నారు రచయిత్రి. 
               ఈ పుస్తకం లో అప్నఘర్ లోని పిల్లల తో తాను రచించి, వారిచే వేయించిన అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్, వారి ఆటలు, పాటలు, డ్రామాలు వాటి గురించి చాలా చక్కగా వివరించారు.  ఇటువంటి కార్యక్రమాలు  పిల్లలలో ఎంతో ఉత్సాహాన్ని, మానసిక బలాన్ని  ఇస్తాయి అని అంటారు.  
              శోభా పెరిందేవి ఈ పుస్తకం ఒక్క పేద పిల్లల కోసం రాసినదే కాదు. అందరు చిన్నారులు వారు రాసిన నాటికలు, నాటికలు, స్కిట్స్  వంటివి ఎంతో సందేసాత్మికంగా వున్నాయి.  ఈ పుస్తకం లో రాసిన 9 నాటికలలో  నగరం లోని వివిధ స్కూల్ విద్యార్దులు కుడా స్టేజి మీద వేసేవారు. బహుమతులు అందుకున్నారు. వీరు రచించిన ఈ నాటికలు ఒక్కొక్కటి ఆణిముత్యం . సందేశాలను అందిస్తాయి. 
           *  పిల్లలని పెంచేటప్పుడు తల్లి తండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దితే ఎటువంటి ఫలితాలని ఇస్తుందో 'జననీ జన్మ భూమిశ్చ' అనే నాటిక చెబుతుంది. ఇందులో పిల్లలు తమకిష్టమైనవి తీర్చుకోలేక, పెద్దల అభీష్టాలను తీర్చలేక మానసిక వత్తిడికి లోనై ఇంటినుంచి పారిపోవటం,  వారిలోని సృజనాత్మక లోపించటం వంటివి జరుగుతుంది. ఈ నాటిక బాలల నాటక పోటీల్లో బహుమతి కుడా పొందింది. 
          * పిల్లలు ఎక్కువగా ఇష్టపడే జంతువులు ముఖ్య పాత్రలుగా పిల్లలచే చేయించే నాటిక 'అడవిలో అందాల పోటి;  ఇందులో అందమైన జంతువులు ఎన్ని వున్నా నల్లగా వున్నా ఒక కాకి బహుమతి గెల్చుకోవటం దానికి కారణం వివరించే తీరు మనుషుల్లో  గతించిన  పెద్దలపై పెట్టే తీర్ధ విధులు ఒక కాకి ఎలా ఆహారంగా తీసుకుని సమాజానికి ఉపయోగ పడుతుంది అని చెబుతుంది. 
          * ఇంకో  నాటకం 'హాపీ డేస్'. సంవత్సరం లో మనం జరుపుకునే సెలవు రోజులు, వాటి ప్రముఖ్యతవి వివరిస్తుంది. దీన్ని చిన్న పిల్లలు అంటే యల్ కేజీ పిల్లలచే కూడా చేయించ వచ్చు. 
           * అలాగే మనుషులకే కాదు వారు వాడే వస్తువులకి ప్రాణం వస్తే అవి ఎలా మాట్లాడుకుంటాయో, ఎలా బాధ పడుతుంతాయో అని చెప్పే నీతి నాటకం 'మా పాట్లు వినేదేవరండి' అనే నాటిక చెబుతుంది.. 
           * టీచర్స్ డే నాడు ప్రదర్శించే నాటకం ....   ఒక విద్యార్ధి  తన టీచర్ చెప్పినవి పాటిస్తూ ఎలా పైకి వచ్చాడో 'గురు దక్షణ' అనే నాటకం చెబుతుంది. 
           * అన్నీ నాటకాలే కాకుండా గేయ రూపకం 'హైదరాబాద్ హైలైట్స్'. ఇది   వెనక పాట పాడుతూ వుంటే హైదరాబాద్ నగర విశేషాలు  అభినయించే నాటకం. 
            * 'రక్షించండి' నాటకంలో అయితే భూమాత విలాపం. ప్రజలంతా భూమి మీద చేసే దారుణం గా తనని ఎలా  హింసిస్తున్నారో, తనని రక్షించమని భూదేవి వరుణ దేవుని, వాయుదేవుని వేడుకోవటం వుంటుంది. ఇది పర్యావరణానికి సంబంధించిన నాటిక. ఇది ఒక సందేశాత్మక నాటకం. 
           *  పుట్టిన రోజు నాడు వేడుకగా పార్టీలు, పిక్నిక్ లు, సరదాగా గడపటం కన్నా అనాధ పిల్లలకి , పేద పిల్లలకి , వృద్ధులకి  ఇలా ఏదైనా ఆశ్రమాలకి వెళ్లి అన్నదానం చేయటం, పిల్లలతో ఆటలాడించటం, వారితో గడిపినపుడు ఆ పిల్లలు పొందే అనందం ఎలా వుంటుందో తెలిపే నాటిక  జన్మదిన కానుక  అనే నాటకం లో తల్లితండ్రులు తమ పిల్లలకి ఇచ్చే బహుమతి ఏదో తెలుపుతుంది. 
           * 'పుస్తక విలాపం' అనే నాటకం లో పుస్తకాలు చదవటం తగ్గిపోతున్న ఈ రోజుల్లో లైబ్రరీ లలో వుండే పుస్తకాలు ఎలా బాధ పడతాయో తెలుపుంది. గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా ఈ నాటిక రచించి, ప్రదర్శించారు. ఇది పిల్లలే కాదు పెద్దలు కూడా వేయచ్చు అనేలా వుంది.  
           ఈ నాటకాలన్నీ కూడా 15ని. లోపే వుంటాయి. తేలిక సంభాషణలతో చిన్నారులు గుర్తు పెట్టుకొని నటించేలా వుంటాయి. 
           వీటిలో  చాల నాటకాలు అప్నాఘర్ పిల్లలు ప్రదర్శించారు.          
          "భారత్ అవార్డ్" ఎంతో ప్రతిష్టాత్మక మైనది. చిన్నారులలో సాహస వీరులకి ప్రభుత్వం అందించే ఈ అవార్డుని అందుకోవటం చాలా గొప్ప విషయం. ఈ పుస్తకం లో రచయిత్రి భారత దేశం లో సాహవీర బాలుల గురించిన వివరాలు చాల విపులంగా చెప్పారు. వారిలో మన తెలుగు వారి 13సం   అమ్మాయి ఇంకొకరి ప్రాణాలు కాపాడబోయి తన ప్రాణాలు కోల్పోయింది. అలాగే మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు రక్షించిన హరీష్ చంద్ర వయసు 14 సం. అతని కధనం కుడా ఇందులో పొందు పరచారు రచయిత్రి.  ఎన్నో విషయాలు తెలియ చెప్పే ఈ పుస్తకం కుడా నిజంగా చిన్నారులకి మార్గదర్శి కూడా.  
              " విధి  నెదిరుస్తున్న వీధి బాలాలు పేద పిల్లలు - పుస్తకం పరమ పాఠనీయంగా తీర్చిదిద్దింది శోభా పెరిందేవి" అని ప్రశంసించారు డా. సి. నారాయణ రెడ్డి గారు. 
         "బాలలకు స్పూర్తిగా వుండటం కోసం నాటికలు రచించి ప్రచురించారు. ఇవి తల్లి తండ్రులకి కూడా స్పూర్తిదాయకం. ఒక మంచి గ్రంధాన్ని సమాజానికి అందిస్తున్న శోభా పెరిందేవిని మనసారా అభినందిస్తున్నా" అని అంటారు డా. బి. జయరాములు గారు తన ముందు మాటలో.  వీరు ఉస్మానియా యూనివెర్సిటి ఓరియంటల్ ఫ్యాకల్టీ ఇన్ చార్జ్ డ్ డీన్ గా పనిచేసి పదవి విరమణ చేసారు. 
         "ఈ పుస్తకం - అభినందన భవాని అప్నాఘర్ ఏర్పడడానికి గల కారణాలు, ఎన్ని కస్టాలు ఎదుర్కొంది, సంస్థలోని పిల్లలు, పిల్లల మనస్తత్వం అన్నీ కూడా చక్కగా వివరిస్తూ రచయిత్రి కొన్ని నాటికలను బాలలకి  స్తూర్తిదాయకంగా వుండేలా రచించారు. 
         డా. శోభా పెరిందేవి గారు రచయిత్రే కాదు ప్రముఖ సంఘ సేవకురాలు కుడా. వృద్దులకి అవసరమైన వారికి సేవ చేస్తూ ఇటు చిన్నారులకి కుడా  తన సేవలందిస్తున్నారు.   సంఘసేవకురాలే కాదు.   తమ తండ్రి గారు, అత్తగారు మామగారు, అన్నయ్యల పేరిట స్మారక బహుమతులూ ప్రతి ఏటా అందిస్తుంటారు.  ఈ పుస్తకం కినెగే లో కుడా దొరుకుతుంది.  kinegie.com  
          

-మణినాథ్ కోపల్లె
9703044410
         

3, అక్టోబర్ 2015, శనివారం

"అమావాస్య చంద్రిక " డా. గురజాడ శోభాపేరిందేవి

నేటి నిజం దినపత్రికలో నేను రాసిన పుస్తక సమీక్ష


పుస్తకం పేరు:    అమావాస్య చంద్రిక
రచయిత్రి         డా. గురజాడ శోభాపేరిందేవి   
పుస్తక సమీక్ష
అమావాస్య చంద్రిక
-మణినాథ్ కోపల్లె
ప్రముఖ రచయిత్రి, సంఘసేవకురాలు డా. గురజాడ శోభాపేరిందేవి రచించిన అమావాస్య చంద్రిక పుస్తకాన్ని  శ్రీశ్రీశ్రీ చిన జియ్యర్ స్వామి వారు    సామాజిక సత్ సాహిత్య స్వరూపం అని అభివర్ణించారు.
ఈ పుస్తకం కిన్నెర వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీమతి  కిన్నెర నాగచంద్రిక గారి జీవిత కథ. ఈ పుస్తకంలో నాగ చంద్రిక జీవితంలో అనుభవించిన సుఖదుఖాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ చాలా హృద్యంగా వివరించారు రచయిత్రి. నాగచంద్రిక జీవితంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగ పడే అంశాలను వివరించారు.  వ్యక్తి జీవితంలో ఎదురయ్యే కష్టాలు,  కన్నీళ్ళు, సమస్యలు   ఎలా ఎదుర్కొని  థృడవంతులుగా, శక్తివంతులుగా మార్చి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపేలా చేస్తాయో చక్కగా చెప్పారు రచయిత్రి.
          చిన్నప్పటి నుంచి గారంబంగా మేనమామ ఇంట పెరిగిన నాగచంద్రిక జీవితంలో వివాహం ఒక పెద్ద మలుపు.. తెలిసీ తెలియని వయసులో  కొత్త పెళ్ళికూతురిగా అడుగుపెట్టిన నాడే ఆమె  భర్త వ్యాధి గ్రస్థుడని  తెలియసినా మనోధైర్యంతో నిలబడిన  అనంతరం ఆమె జీవితంలో ఎదుర్కున్న సమస్యలు  ఆమెని జీవితంలో రాయిని చేసి సమాజ సేవకై అంకితం చేసేలా చేశాయి.
 ఆచార విరుద్ధం అని అందరూ ముక్కున వేలేసుకున్నా నాగచంద్రిక తల్లికి తనే కర్మ కాండలు జరపడం ఆమె లోని ధృడ సంకల్పం చెబుతుంది.  తనకి చెడు చేసిన వారిని కూడా  ఆమె క్షమించింది.  ఆశ్రమంలో అవసాన దశలో ఉండే వృద్ధులకి సపరిచర్యలు చేస్తూ, వారి మరణానంతరం అంతిమ సంస్కారాలు చేయించేవారు నాగచంద్రిక. మానవసేవే మాధవసేవ అని నిరూపిస్తూ నలుగురికీ మార్గదర్శకంగా నిలిచారు.  
          నాగచంద్రిక జీవిత చరిత్రని అందరిలో మనో ధైర్యాన్ని పెంచేలా వ్యక్తిత్వ వికాసానికి దోహద పడేలా రచయిత్రి వివరించారు.  పెరిగిపోతున్న వృద్ధుల నిరాదరణ గురించి చెబుతూ  ఇంట్లో వృద్ధులని గౌరవించాలని, అది పిల్లల బాధ్యతని, పగ, ద్వేషం మనిషి పతనానికి దారితీస్తుందని చెబుతారు. 
ఈ పుస్తకంలో రచయిత్రి వృద్ధాశ్రమాలలోని వ్యక్తుల మానసిక పరివర్తన ఏలా ఉంటుందో, ఎలాటి వ్యక్తులు వుంటారో చక్కగా వివరించారు.
  ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహించడంలో ఎన్నో సమస్యలెదురవుతాయి. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కున్నారు నాగచంద్రిక. ఈ పుస్తక ఒక నవలలా సాగిపోతుంది తప్ప బయగ్రఫీ పుస్తకం అనిపించదు చదువుతుంటే.... జీవితంలో ఎదురయ్యే చీకట్లను తిడుతూ కూర్చోకుండా చీకట్లు పారద్రోలే శక్తి స్త్రీ కి వుందని నిరూపిస్తుంది. అత్యధిక స్త్రీల మరణాలలో ఆత్మహత్య చేసుకునే వారే ఎక్కువగా నమోదవుతున్నాయనే వివరాలు,  ఆత్మహత్య కారణాలు... అన్నీ వివరంగా  ఈ పుస్తకంలో రచయిత్రి తెలిపారు. 
నాగచంద్రిక ఉద్యోగ పర్వంలో ఆమెకి అభినవ కీచకులు, అభయహస్తం అందించే స్నేహశీలురూ ఎదురయ్యారు.  డబ్బే పరమార్ధంగా   జీవించే వారింటకూడా ఆమె మనోధైర్యంగా నిలబడింది. ఎంత డబ్బున్నా ఆకలి తీర్చేది అన్నమే కాని కాసులు కావని అర్ధం చేసుకోని వ్యక్తుల మధ్య  జీవించింది నాగచంద్రిక. వివాహబంధం గురించి రచయిత్రి చక్కగా వివరించారు.
 కిన్నెర వెల్ఫేర్ సొసైటీని గత 12 సంవత్సరములుగా నిర్వఘ్నంగా నడుపుతున్న  నాగచంద్రిక  పలు రాష్ట్రీయ, జాతీయ అవార్డులు అందుకున్నారు. పలువురి ప్రశంసలు అందుకున్నారు.
రచయిత్రి డా.గురజాడ శోభాపేరిందేవి రచించిన ఆటో బయోగ్రఫీలలో ఇది మూడవ పుస్తకం. తొలుత స్వాతంత్ర్య వీరుడు కా నా, ఆమె ఓటమినోడించింది, మూడు అమావాస్య చంద్రిక. ఇంకా మరో రెండు మూడు బయోగ్రఫీ పుస్తకాలు త్వరలో రాబోతున్నాయి....
  

-మణినాథ్ కోపల్లె
9703044410