10, ఆగస్టు 2017, గురువారం

శ్రీ రాఘవేంద్ర స్వామి


 శ్రీ  గురు రాఘవేంద్రాయ నమః 
                                         




  

పూజ్యాయ  రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయాచ!

భజతాం కల్ప వ్రుక్షాయ నమతాం కామదేనవే!!

మంత్రాలయం లో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనా మహోత్సవాలు ఈ రోజుతో ముగిసాయి. హేవలంబి నామ సంవత్సరంలో రాయరు ఆరాధనలు 8 ఆగస్టు తారీకున స్వామి వారి పూర్వారాధన, 9 న మధ్యారాధన 10 తారీకున ఉత్తరాధన జరిగాయి. దేశ మంతా వున్న శ్రీ రాఘవేంద్ర స్వామీ వారి మఠాలలో అంగరంగ వైభవంగా జరిగాయి.
నగరంలోని బర్కత్ పురాలో ను, కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని రాఘవేంద్ర స్వామి మఠం లోనూ వైభంగా జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి జీవితం సంగ్రహంగా .....
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671) మధ్య కాలంలో జీవించారు. ద్వైత సిద్దాంత ప్రచారకులు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని ఆచరిం చారు.  రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు మరియు గోపికాంబ అనే కన్నడ బ్రాహ్మణ దంపతులకి రెండవ సంతానంగా 1595లో జన్మించారు. రాఘవేంద్ర స్వామికి ఒక సోదరుడు (గురురాజ), సోదరి (వేంకటాంబ) ఉన్నారు.  
వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడ్ని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీబాయితో వీరికి వివాహమయింది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించారు.

వీరి శిష్యులు వీరిని ప్రహల్లద అవతారంగా భావిస్తారు మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించారు.
వీరు శ్రీ పంచ ముఖ ఆంజనేయ స్వామి  భక్తులు.  మూల రాముని పూజించేవారు. రాఘవెంద్రులు  పంచముఖిలో తపస్సు చేసారు, ఇక్కడ  హనుమంతుడు సాక్షాత్కరిం చాడు.  తమిళనాడు లోని కుంభకోణం మధ్వ మఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించారు.   

  ఇతని శిష్యగణం వీరిని  ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు.   ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తులు.. తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత మరియు వైదికశాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టాడు. రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికులు  కూడా. గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణభారతదేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు.  మంత్రాలయంలో జీవసమాధి పొందారు. నిత్యమూ వేలాది మంది భక్తులు మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ప్రతి గురువారం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యెక పూజలు,అలంకార సేవ జరుగుతాయి. ఎక్కువ మంది భక్తులు గురువారం నాడు స్వామివారిని మంత్రాలయంలో దర్శించు కుంటారు.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి